విస్తృతంగా వాహనాల తనిఖీ
ABN , First Publish Date - 2021-04-16T07:18:09+05:30 IST
లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లోని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 15: లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లోని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. వారి ధృవీకరణ పత్రాలను పరిశీలించి, వివరాలను నమోదుచేసుకుని పంపించారు. జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టుల్లోనూ తనిఖీలు సాగాయి.