139 నంబరు హెల్ప్లైన్పై విస్తృత ప్రచారం
ABN , First Publish Date - 2022-05-21T06:31:40+05:30 IST
రైళ్లలో ప్రయాణించేటపుడు ఏదైనా సాయం అవసరమైతే 139 నంబరుకు కాల్ చేయాలనే విషయంపై విస్తృత ప్రచారం చేయాలని రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)కు రైల్వే వినియోగదారుల ప్రతినిధులు సూచించారు.
విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): రైళ్లలో ప్రయాణించేటపుడు ఏదైనా సాయం అవసరమైతే 139 నంబరుకు కాల్ చేయాలనే విషయంపై విస్తృత ప్రచారం చేయాలని రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)కు రైల్వే వినియోగదారుల ప్రతినిధులు సూచించారు. ఆర్పీఎఫ్ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. రైళ్లలో ఎవరైనా పెద్దగా మాట్లాడటం, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఎక్కువ సౌండ్తో మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టడం, మహిళలను లైంగికంగా వేధించడం వంటి ఏ సమస్యలైనా 139కి ఫిర్యాదు చేయవచ్చునంటూ మైకుల ద్వారా ప్రచారం చేయాలని వినియోగదారుల ప్రతినిధులు కాండ్రేగుల వెంకటరమణ, తదితరులు సూచించారు. అలాగే పోలీసులు కూడా ప్రయాణికులతో అతిగా వ్యవహరించకూడదని, అలాంటి విషయాల్లోను జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఒంటరి మహిళలకు రక్షణగా ఆర్పీఎఫ్ దళాలు కోచ్ల్లో ప్రయాణిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.