రైతులకు దీర్ఘకాలిక రుణాల చెక్కులను పంపిణీ చేస్తున్న చైర్మన్ సతీష్
శంషాబాద్ రూరల్: సొసైటీల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తున్నట్లు మల్కారం పీఎ్ససీఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ అన్నారు. పీఎ్ససీఎస్ కార్యాలయంలో సోమవారం ముగ్గురు రైతులకు రూ.13.13 లక్షల దీర్ఘకాలిక రుణాలు మంజూరుచేసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏవో కవిత, వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 16మంది రైతుల నుంచి 538 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. ఈవో నర్సింహులు, రైతులు పాల్గొన్నారు.