మాఘ పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-02-25T06:37:36+05:30 IST
మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27వ తేదీ శనివారం రేవుపోలవరం సముద్ర తీరానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆదేశించారు.
ఎమ్మెల్యే బాబూరావు ఆదేశం
ఎస్.రాయవరం, ఫిబ్రవరి 24 : మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27వ తేదీ శనివారం రేవుపోలవరం సముద్ర తీరానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆదేశించారు. బుధవారం సాయంత్రం రేవుపోలవరం తీరంలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా మహిళలు స్నానాల అనంతరం దుస్తులను మార్చుకోవడానికి తాత్కాలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తీరంలో ప్రమాదకరస్పాట్ల వద్ద గజ ఈతగాళ్లను నియమించాలని, ఎప్పటికప్పుడు మైక్ ద్వారా ప్రచారం చేపట్టాలని సూచించారు. వైసీపీ నాయకులు చేకూరి శ్రీరామచంద్రరాజు, కొర్ని రాజారమేశ్, శ్రీపతిరాజు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.