మునిసిపాలిటీల ప్రత్యేకాధికారుల పదవీ కాలం పొడిగింపు

ABN , First Publish Date - 2020-08-07T10:18:38+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల ప్రత్యేకాధికారుల ..

మునిసిపాలిటీల ప్రత్యేకాధికారుల పదవీ కాలం పొడిగింపు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ


విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల ప్రత్యేకాధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవీఎంసీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఉన్నారు. ఈ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది.


తాజా ఉత్తర్వుల ప్రకారం  ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పదవీకాలం పెంచారు. నర్సీపట్నం మునిసిపాలిటీ ప్రత్యేకాధికారిగా నర్సీపట్నం ఆర్డీవో, ఎలమంచిలికి అనకాపల్లి ఆర్డీవో కొనసాగుతున్నారు. ఈ రెండు మునిసిపాలిటీల ప్రత్యేకాధికారుల పదవీకాలం గత నెల రెండో తేదీతో ముగియగా, తాజాగా  వచ్చే ఏడాది జనవరి రెండు వరకు పదవీ కాలాన్ని పెంచారు. ఈలోగా ఎన్నికలు జరిగితే పాలకవర్గాలు వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Updated Date - 2020-08-07T10:18:38+05:30 IST