21 వరకు పీజీ పరీక్ష ఫీజు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-07-16T11:57:49+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని అన్ని అనుబంధ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులైన ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ, ఎంకామ్‌, ఎంబీఏ, ఎంసీ ఏ,

21 వరకు పీజీ పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూలై 15: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లోని అన్ని అనుబంధ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులైన ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ, ఎంకామ్‌, ఎంబీఏ, ఎంసీ ఏ, ఐఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ఐసీ కోర్సుల్లో 2, 4, 6, 8, 10 సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌లాగ్‌, ఽథియరీ, ప్రాక్టికల్‌ పరీక్షల ఫీజు గడువు జూలై 21 వరకు పొడిగిం చినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఘంటా చంద్రశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష దరఖాస్తు పత్రాన్ని ఆన్‌లైన్‌లో పూర్తి చేసి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపాలని సూచించారు. పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-16T11:57:49+05:30 IST