జేసీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-03-02T12:08:04+05:30 IST
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి చెందిన జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేసీసెట్-2021 ప్రవేశ పరీక్ష గడువును మార్చి 10 వరకు పొడిగించారు...
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి చెందిన జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేసీసెట్-2021 ప్రవేశ పరీక్ష గడువును మార్చి 10 వరకు పొడిగించారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ కోర్సులకు సంబంధించి ఆసక్తి కలవారు సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి ఆర్ఎ్స.ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4న ఉదయం 10 నుంచి 1గంట వరకు ఉంటుందన్నారు.