కరోనాతో మాజీ సైనికుడి మృతి

ABN , First Publish Date - 2021-05-08T04:59:51+05:30 IST

బొబ్బిలి పట్టణానికి చెందిన మాజీ సైనికుడు భుజంగరావు (39) కరోనా తో శుక్రవారం మృతిచెందారు.

కరోనాతో మాజీ సైనికుడి మృతి

 సీతానగరం(బొబ్బిలి), మే 7: బొబ్బిలి పట్టణానికి చెందిన మాజీ సైనికుడు భుజంగరావు (39) కరోనా తో శుక్రవారం మృతిచెందారు. విష యం తెలుసుకున్న జిల్లా త్రిదళ మాజీ సైనికుల సంఘం గౌరవ అధ్యక్షుడు మారడ అప్పారావు, అధ్య క్షుడు సబ్బన సతీష్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీ రామకృష్ణ మాస్టారు, మచ్చ మురళీధర్‌, రెడ్డి అప్పలనాయుడు తదితర సంఘ నాయ కులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పదిరోజుల క్రితం ఆయ న కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం శ్రీకా కుళంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. పది రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజుల ముం దు ఆయన సోదరుడు కూడా కరోనాతో చనిపోయాడు. ఆయన తల్లి గత ఏడాది కరోనాకు బలయ్యారు.

 


Updated Date - 2021-05-08T04:59:51+05:30 IST