బాంబు కలకలం.. ఉలిక్కిపడ్డ ఢిల్లీ
ABN , First Publish Date - 2022-01-14T20:08:23+05:30 IST
ఢిల్లీ: ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. తూర్పు ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్ సమీపంలో
ఢిల్లీ: ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. తూర్పు ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్ సమీపంలో అనుమానాస్పద సంచి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో బాంబును గుర్తించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కు సమాచారం ఇవ్వడంతో వారు ప్రత్యేక వాహనంలో వచ్చి బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వీర్యం చేశారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు.
Delhi: National Security Guard NSG carries out a controlled explosion of the IED found at East Delhi's Ghazipur Flower Market