పాక్లో పేలుడు.. 12 మంది మృతి
ABN , First Publish Date - 2021-12-18T22:32:03+05:30 IST
కరాచీ: పాకిస్థాన్ కరాచీ షేర్షా పరాచా చౌక్ ప్రాంతంలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
కరాచీ: పాకిస్థాన్ కరాచీ షేర్షా పరాచా చౌక్ ప్రాంతంలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.