పాక్‌లో పేలుడు.. 12 మంది మృతి

ABN , First Publish Date - 2021-12-18T22:32:03+05:30 IST

కరాచీ: పాకిస్థాన్‌ కరాచీ షేర్షా పరాచా చౌక్‌ ప్రాంతంలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

పాక్‌లో పేలుడు.. 12 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌ కరాచీ షేర్షా పరాచా చౌక్‌ ప్రాంతంలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 



Updated Date - 2021-12-18T22:32:03+05:30 IST