వైసీపీ దోపిడీని ప్రజలకు వివరించండి
ABN , First Publish Date - 2022-08-17T05:05:59+05:30 IST
వైసీపీ ప్రభుత్వ దోపిడీ విఽధానాలు ప్రజలకు వివరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్
బూర్జ: వైసీపీ ప్రభుత్వ దోపిడీ విఽధానాలు ప్రజలకు వివరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం వావాం గ్రామంలో టీడీపీ బూత్ కమిటీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలన్నారు. ఓటరు నమోదు, సవరణ జరిగే సమ యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం జగన్ ఒక చేత్తో సంక్షేమ పథకాల అని చెప్పి, మరొక చేతితో ప్రజల నుంచి దోపిడీకి పాల్పడుతు న్నారని తెలిపారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆనెపు రామకృష్ణనాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు వి.రాంజీ, లంక జగన్నాథం పాల్గొన్నారు.
‘గోరంట్ల’ గలీజు ఎంపీ
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గ్రీష్మ
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 16: గలీజు ఎంపీ గోరంట్ల మాధవ్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ విమర్శించారు. మంగళవారం ఆమె శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. మాధవ్ వంటి దరిద్రుడికి సంబం ధించిన వీడియోలను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం, గత్యంతరం టీడీపీకి లేదన్నారు. చేసిన దరిద్రపు పనులకు సిగ్గుపడకుండా కులం పేరును ఆపా దించడం, లోకేష్, చంద్రబాబులను విమర్శించడం సరికాదన్నారు. వైసీపీ నేతలు మూడేళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, మళ్లీ రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచనలతో చంద్రబునాయుడు ఉన్నారని చెప్పారు. వైసీపీ నాయకుల పరువు తీయాలన్న ఆలోచన టీడీపీకి లేదని.. వారి పరువు, రాష్ట్రం పరువును పోటీపడి వైసీపీ నేతలే తీసుకుంటున్నారని విమర్శించారు.