Expired saline bottles ఎక్కించిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది

ABN , First Publish Date - 2021-10-13T17:48:48+05:30 IST

టోలిచౌకిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రోగికి గడువు ముగిసిన సెలైన్‌ బాటిళ్లను ఎక్కించారంటూ రోగి బంధువులు గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. వివరాల్లోకి వెళితే టోలిచౌకిలోని

Expired saline bottles ఎక్కించిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది

గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్/లంగర్‌హౌస్‌: టోలిచౌకిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రోగికి గడువు ముగిసిన సెలైన్‌ బాటిళ్లను ఎక్కించారంటూ రోగి బంధువులు గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. వివరాల్లోకి వెళితే టోలిచౌకిలోని యాపిల్‌ ఆస్పత్రిలో అనారోగ్యంతో నజ్మా అనే మహిళ రెండు రోజుల క్రితం చేరింది. అయితే గడువు ముగిసిన సెలైన్‌ బాటిల్‌ను ఆస్పత్రికి వచ్చిన బంధువులు గమనించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో సోమవారం ఉదయం గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోగికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందిందని, విచారణలో ఆస్పత్రిలో గడువు ముగిసిన సెలైన్‌ బాటిల్స్‌ కనిపించలేదని టోలిచౌకి పోలీసులు తెలిపారు. ఫిర్యాదుచేసిన వారిని విచారణ కోసం పిలిపిస్తే స్పందించలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - 2021-10-13T17:48:48+05:30 IST