రూ.30 లక్షలు గుట్కాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-06T05:05:29+05:30 IST

కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ ప్రాంతం నుంచి వినుకొండకు గుట్కా తరలిస్తున్న వాహనాన్ని పిడుగురాళ్ల ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.

రూ.30 లక్షలు గుట్కాలు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ కొండారెడ్డి

పిడుగురాళ్ల, ఆగస్టు 5: కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ ప్రాంతం నుంచి వినుకొండకు గుట్కా తరలిస్తున్న వాహనాన్ని పిడుగురాళ్ల ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. కొండమోడు సమీపంలో ఎక్సైజ్‌ సీఐ కొండారెడ్డి  వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారులు చూసి లారీని రోడ్డుపక్కగా నిలిపి అందులోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. క్యాబిన్‌ను పరిశీలించగా 96 తెలంగాణా మద్యం బాటిళ్లు, 1,42,500 గుట్కా ప్యాకెట్లను అందులో ఉండటాన్ని గుర్తించారు. పట్టుబడ్డ సరుకు విలువ సుమారు రూ.30లక్షలకు పైగా ఉంటుందని సీఐ  తెలిపారు. ముర్రబోయిన సాయికుమార్‌, గడిపర్తి మణికంఠలను అదుపులోకి తీసుకొని మినీలారీని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో వినుకొండకు చెందిన పారా లింగారావును అరెస్ట్‌ చేయాల్సి ఉందని, అతనిపై పిడుగురాళ్ల ఎక్సైజ్‌స్టేషన్‌లో గతంలోనూ ఒక కేసు నమోదైందని సీఐ కొండారెడ్డి తెలిపారు. 


Updated Date - 2022-08-06T05:05:29+05:30 IST