మృతుడి భార్యకు ఎక్స్గ్రేషియా
ABN , First Publish Date - 2022-07-06T07:14:33+05:30 IST
చిత్తూరు జిల్లా హోంగార్డ్స్ యూనిట్లో హెడ్గార్డ్గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 18న గుండెపోటుతో మరణించిన ఉదయ్కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
చిత్తూరు, జూలై 5: చిత్తూరు జిల్లా హోంగార్డ్స్ యూనిట్లో హెడ్గార్డ్గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 18న గుండెపోటుతో మరణించిన ఉదయ్కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. డీ జీపీ ఆఫీస్ నుంచి మంజూరైన రూ.5లక్షలను మంగళవారం ఎస్పీ రిషాంత్రెడ్డి మృతుడి భార్య వాణికి అందించారు. పోలీస్ శాఖ తరపున కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ రేంజ్ హోంగార్డ్స్ కమాండెంట్ రామ్మోహన్, హోంగార్డ్స్ డీఎస్పీ లక్ష్మణ్కుమార్, ఆర్ఐ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.