కోవిడ్ తో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా

ABN , First Publish Date - 2022-01-05T20:22:04+05:30 IST

రాష్ట్రంలో కోవిద్ -19 తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది

కోవిడ్ తో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిద్ -19 తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోవిద్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలను ఎక్స్ -గ్రేషియాగా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ఎక్స్-గ్రేషియా పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ తెలియచేసింది. కోవిద్-19 తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. 


ఈ దారఖాస్తులోబ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచి మీ సేవా కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కోవిద్ డెత్ నిర్దారణ కమిటీ కోవిద్-19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని, దీని అనంతరం ఎక్స్-గ్రేషియాను మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040 -48560012 అనే నెంబర్ కు గానీ,meesevasupport@telangana.gov.in అనే మెయిల్ కు సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2022-01-05T20:22:04+05:30 IST