ఉత్సాహంగా షటిల్‌ టోర్నమెంటు

ABN , First Publish Date - 2022-01-15T04:39:52+05:30 IST

మండలం లోని రంగసము ద్రం పంచాయతీ కమ్మవారిపల్లెకు చెందిన చెరుకూరి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకొని ఈ నెల 12, 13, 14 తేదీలలో కార్తీక్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ పోరుమామిళ్ల పోలీ్‌సస్టేషన్‌ మెదానంలో నాలుగు మండలాల షటిల్‌ టోర్నమెంట్‌ ఉత్సాహంగా సాగింది.

ఉత్సాహంగా షటిల్‌ టోర్నమెంటు
బహుమతులు అందుకున్న క్రీడాకారులు

పోరుమామిళ్ల, జనవరి 14 : మండలం లోని రంగసము ద్రం పంచాయతీ  కమ్మవారిపల్లెకు చెందిన చెరుకూరి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి  పురస్కరించుకొని ఈ నెల 12, 13, 14 తేదీలలో కార్తీక్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ పోరుమామిళ్ల పోలీ్‌సస్టేషన్‌ మెదానంలో నాలుగు మండలాల షటిల్‌ టోర్నమెంట్‌ ఉత్సాహంగా సాగింది. ఇందులో పిట్టిగుంటకు చెందిన వినోద్‌, బాబులు ప్రతిభను కనుబరిచి ప్రథమ స్థానంలో నిలువగా వారికి చెరకూరి రవికుమార్‌ రూ.20 వేలు నగదు బహుమతిని అందజేశారు. అలాగే పోరుమామిళ్లకు చెందిన సురేంద్ర, బాల ద్వితీయ స్థానలో నిలిచి రూ.15 వేలు, ప్రసాద్‌, వెంకీ  తృతీయ స్థానం లో నిలిచి రూ.10 వేలు  బహుమతిని అందుకున్నారు. గిరికాలనీకి చెందిన బింటూ, లోకే్‌షలు నాలుగవ స్థానంలో నిలిచి రూ.5 వేలు అందుకోగా  టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన సోని, మధులకు రూ.10 వేలు, చరణ్‌, బాషాలకు రూ.10 వేల వంతున అందించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అనీల్‌, హరీష్‌, ఆర్గనైజర్లు ప్రసాద్‌, డీవీ సుబ్బయ్య, హరికిషోర్‌, చెన్నరాయుడు, శివ, సురేంద్ర, కృష్ణ, బాలచంద్రుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-15T04:39:52+05:30 IST