ఉత్సాహంగా పోటీలు
ABN , First Publish Date - 2022-01-17T04:56:53+05:30 IST
కరవంజ గ్రామంలో శనివారం ఉత్సాహంగా సంగిడీలు, వెయిట్ లిప్టింగ్, తోపుడు గుళ్లు పోటీలు నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవా న్ని పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించారు.
జలుమూరు, జనవరి 16: కరవంజ గ్రామంలో శనివారం ఉత్సాహంగా సంగిడీలు, వెయిట్ లిప్టింగ్, తోపుడు గుళ్లు పోటీలు నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవా న్ని పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించారు. సంగిడీ, తోపుడుగుళ్లు పోటీల్లో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యన్నారాయణ విజేతగా నిలువగా నిమ్మాడ గ్రామానికి చెందిన ఆవల గోవిందరావు ద్వితీయస్థానం సాధించారు. సంగిడీల పోటీల్లో తమ్మన్నపేటకి చెందిన తమ్మినేని వేంకటేష్ తృతీయ స్థానం సాధించాడు. తోపుడుగుళ్లు పోటీలో ముద్దాడ వెంకటరావు తృతీయ స్థానం సాధించాడు. మహిళల విభాగం వెయిట్లిప్టింగ్ పోటీలో ఆడవరానికి చెందిన బుజ్జెల వర్షిత ప్రథమ, గొదలాం గ్రామానికి చెందిన ధనం ద్వితీయ, భావనపాడుకు చెందిన బి.హారిత తృతీయ స్థానం సాధించారు. పురుషులు విభాగంలో నిమ్మాడకి చెందిన ఆవల గోవిందరావు ప్రథమ, పెద్దపాడు గ్రామానికి చెందిన ముద్దాడ తరుణ్ ద్వితీయ, సాకిపల్లికి చెందిన మట్ట జగపతిబాబు తృతీయ స్థానం సాధించినట్లు ఉత్సవ కమిటీ తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జుత్తు నేతాజీ, మాజీ సర్పంచ్ జుత్తు అప్పలనాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్దఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.