ఉత్సాహంగా పోలీసుల 2కే రన్
ABN , First Publish Date - 2022-06-27T04:21:05+05:30 IST
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ను సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు 2కేరన్ నిర్వహించామన్నారు.
వాంకిడి, జూన్ 26: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ను సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు 2కేరన్ నిర్వహించామన్నారు. ఈసందర్భంగా యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. 2కేరన్లో విజేతలుగా నిలిచిన యువకులకు ప్రత్యేక బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై డీకొండరమేష్, మహిళా ఎస్సై లావణ్య, ఏఎస్సైఓంపాల్, పోలీసులు, యువకులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ టౌన్: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని పట్టణ సీఐ రవీందర్ అన్నారు. ఆదివారం స్థానికంగా పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత మత్తుకు బానిస కావద్దన్నారు. యువతకు మత్తుపదార్ధాలతో కలిగే వివిధ సమస్యలపై సీఐ అవగాహన పరిచారు. ఎస్సై రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.