అదరగొట్టిన ఎయిర్టెల్
ABN , First Publish Date - 2021-05-18T06:00:40+05:30 IST
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020 -21)లో భారతి ఎయిర్టెల్ రూ.1,00,616 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.లక్ష కోట్లు మించడం ఇదే మొదటిసారి
తొలిసారి రూ.లక్ష కోట్లకు పైగా ఆదాయం
క్యూ4లో రూ.759 కోట్ల నికర లాభం
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020 -21)లో భారతి ఎయిర్టెల్ రూ.1,00,616 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.లక్ష కోట్లు మించడం ఇదే మొదటిసారి. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు రూ.16,000 కోట్లు ఎక్కువ. అయితే ఆదాయం లక్ష కోట్లు అధిగమించినప్పటికీ కంపెనీ రూ.15,084 కోట్ల నికర నష్టం చవిచూసింది. కాకపోతే 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నష్టాలను దాదాపు సగం తగ్గించుకుంది.
క్యూ4లో లాభం: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (క్యూ4) కంపెనీ రూ.25,747 కోట్ల ఆదాయంపై రూ.759 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 11.9 శాతం పెరిగింది.