గుంటూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-07-06T00:55:39+05:30 IST

గుంటూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి

గుంటూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి

గుంటూరు: జిల్లాలోని శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కారుమంచి గ్రామంలో 3 వేల 842 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ, టాటా ఎసీ, ఆటో, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం, ముద్దాయిలు అందరూ శావల్యపురం మండలం కారుమంచి,.. వైకళ్లు గ్రామాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-06T00:55:39+05:30 IST