గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు

ABN , First Publish Date - 2022-09-23T06:36:10+05:30 IST

మండలంలోని మారుమూల గ్రామాలైన అంకెన, రాయదారి గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు గురువారం దాడు లు నిర్వహించారు.

గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు
బెల్లంపానకాన్ని పారబోస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది

15 లీటర్ల గుడుంబా.. 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

పెంబి, సెప్టెంబరు 22 : మండలంలోని మారుమూల గ్రామాలైన అంకెన, రాయదారి గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు గురువారం దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై రాయబారపు రవికుమార్‌ మాట్లాడుతూ... ఆది లాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని, దాడుల్లో 15 లీటర్ల గుడుంబా, 400ల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. బోడ అనూ షబాయి, ధనావత్‌ విజయ, గుగ్లావత్‌ హంజాబాయిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సిబ్బంది ప్రకాష్‌, సాయి, రవీందర్‌, భాస్కర్‌, రాజశేఖర్‌ ఉన్నారు.

Updated Date - 2022-09-23T06:36:10+05:30 IST