ఎక్సైజ్‌ దాడులు : ఆరుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-02-24T06:00:31+05:30 IST

ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో సారా విక్రయాలపై విస్తృత దాడులు చేపట్టి ఆరుగురు నింది తులను అరెస్టు చేసినట్టు కొవ్వూ రు ఎక్సైజ్‌ సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు.

ఎక్సైజ్‌ దాడులు : ఆరుగురి అరెస్టు

కొవ్వూరు, ఫిబ్రవరి 23: ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో సారా విక్రయాలపై విస్తృత దాడులు చేపట్టి ఆరుగురు నింది తులను అరెస్టు చేసినట్టు కొవ్వూ రు ఎక్సైజ్‌ సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. మం గళవారం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని దేవరపల్లి మండలం యర్నగూడెంలో గెం జి రాజును అరెస్టు చేసి 5 లీటర్ల సారా,  గునుకూరి సుజాతను అరెస్టు చేసి 5 లీటర్లు, లక్ష్మీపురంలో రాపాక జ్యోతిని అరెస్టు చేసి 5 లీటర్లు, చాగల్లు మండలం చిక్కాలలో పేరుబోయిన శ్రీను, దావీదులను అరెస్టు చేసి 20 లీటర్లు సారా, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా నిడదవోలు మండలం కోరుమామిడిలో పోతుల మహేష్‌ను అరెస్టు చేసి 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్టు సీఐ తెలిపారు.


Updated Date - 2021-02-24T06:00:31+05:30 IST