‘మిషన్‌ కాకతీయ’తో అద్భుత ఫలితాలు

ABN , First Publish Date - 2020-06-06T09:41:49+05:30 IST

చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న మిషన్‌కాకతీయతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ఆనంద్‌

‘మిషన్‌ కాకతీయ’తో అద్భుత ఫలితాలు

ధారూరు: చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న మిషన్‌కాకతీయతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ఆనంద్‌ తెలిపారు.మున్నూరు సోమారం చెరువుపునరుద్ధరణ పనుల కోసం మూడో విడతమిషన్‌ కాకతీయ కింద రూ.39లక్షలు మంజూరు కాగా శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మైనర్‌ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీసుజాత, సర్పంచ్‌అనూష, ఎంపీటీసీ రవి కుమార్‌,రాంరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, సుకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T09:41:49+05:30 IST