అమ్మ చెరువులో మళ్లీ తవ్వకాలు

ABN , First Publish Date - 2021-05-06T04:19:12+05:30 IST

మండలంలోని పెదగాడి అమ్మ చెరువులో అనధికార, అక్రమ మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఎక్సకవేటర్ల సాయంతో రాత్రింబవళ్లు మట్టి తవ్వకాలు చేపట్టి, లారీలతో మట్టిని తరలించే పనులు సాగిపోతున్నాయి.

అమ్మ చెరువులో మళ్లీ తవ్వకాలు
చెరువులో ఎక్సకవేటరు, లారీ

పెందుర్తిరూరల్‌, మే 5: మండలంలోని పెదగాడి అమ్మ చెరువులో అనధికార, అక్రమ మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఎక్సకవేటర్ల  సాయంతో  రాత్రింబవళ్లు మట్టి తవ్వకాలు చేపట్టి, లారీలతో మట్టిని తరలించే పనులు  సాగిపోతున్నాయి. సర్వేనెంబరు 48 పెదగాడి అమ్మ చెరువు విస్తీరణం 53 ఎకరాలు. దీని కింద సుమారు 200 ఎకరాల  ఆయుకట్టు  ఉంది. చెరువులో మట్టి పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులు కన్నేశారు. రెండు వారల కిందట ఎక్సకవేటరును     తీసుకొచ్చి తవ్వకాలు చేపడుతున్నారు.  దీనిపై ‘మట్టినీ మింగేస్తున్నారు’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో తవ్వకాలు నిలిపివేశారు.  తాజాగా మళ్లీ ప్రారంభించి విజయనగరం జిల్లా చింతలపాలెం ప్రాంతంలో గల ఓ ప్రైవేట్‌ లేఅవుట్‌కు తరలించేస్తున్నారని, అధికారులకు తెలిసే ఈ తతంగం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  దీనిపై ఆర్డీవో, తహసీల్దార్‌, జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మాజీ సర్పంచి బొడ్డు అప్పలరాజు వాపోయారు.

Updated Date - 2021-05-06T04:19:12+05:30 IST