బీవీరాజు కళాశాలలో పరీక్షల నిర్వహణపై పరిశీలన
ABN , First Publish Date - 2020-09-24T11:13:48+05:30 IST
బీవీ రాజు కళాశాలలో పరీక్షల నిర్వహణను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.గంగారావు బుధవారం పరిశీలించారు. ఆ
భీమవరం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 23: బీవీ రాజు కళాశాలలో పరీక్షల నిర్వహణను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.గంగారావు బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కళాశాలలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సుమారు 500 మందిపైగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ చివరి సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్లిష్ట సమయంలో కూడా పరీక్షలు నిర్వహణపై శ్రద్ధ వహించారని కళాశాల యాజమాన్యం, సిబ్బందిని రిజిస్ట్రార్ అభినందించారు.