తాటిపూడి రిజర్వాయర్ పరిశీలన
ABN , First Publish Date - 2022-08-11T05:51:19+05:30 IST
తాటిపూడి రిజర్వాయర్ పరిశీలన
గంట్యాడ: తాటిపూడి రిజర్వాయర్ను కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సభ్యులు బుధవారం పరిశీలించారు. సీడబ్ల్యూసీ సీఈ దేవనందతోపాటు ఇతర అధికారులు రిజర్వాయర్తోపాటు ఢ్యామ్ పరిస్థితి, వాటర్ లెవుల్ తదితర వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గట్టు, గేట్ల నాణ్యత క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించ నున్నట్టు తెలిపారు. కార్యక్రమంలోని ఎస్ఈ సూర్యకుమార్, ఈఈ ఉమేష్ కుమార్, డీఈలు టి.శ్రీనివాస్, పాండు, ఏఈ తమ్మినాయుడు పాల్గొన్నారు.