నేడు ఎస్‌జీటీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ABN , First Publish Date - 2020-09-24T08:22:22+05:30 IST

జిల్లాలో డీఎస్‌సీ -2018 పరీక్షలో ఉత్తీర్ణులై ఎస్‌జీటీగా నియామకానికి అర్హత పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ

నేడు ఎస్‌జీటీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), సెప్టెంబరు23: జిల్లాలో డీఎస్‌సీ -2018 పరీక్షలో ఉత్తీర్ణులై ఎస్‌జీటీగా నియామకానికి అర్హత పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24వ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తెలిపారు.  కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌ సమీపంలోని పీఆర్‌జీ బాలికల పాఠశాలలో గురువారం ఉదయం పది గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన మొదలవుతుందన్నారు. అభ్యర్థులు వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లను పరిశీలించుకుని  సర్టిిఫికెట్స్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. అనంతరం పీఆర్‌జీ బాలికల పాఠశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధిత ఒరిజనల్‌ సర్టిపికెట్స్‌, ఒక క్లాత్‌ కవరుతో సహా హాజరు కావాలని డీఈవో అబ్రహాం తెలిపారు. 

Updated Date - 2020-09-24T08:22:22+05:30 IST