3న ల్యాబ్‌టెక్నీషియన్ల ధ్రువపత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-25T08:05:03+05:30 IST

పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మార్చి 3న రెండోదశ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది.

3న ల్యాబ్‌టెక్నీషియన్ల ధ్రువపత్రాల పరిశీలన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మార్చి 3న రెండోదశ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. కాగా, సాంకేతిక విద్యాశాఖలోని బోధనేతర సిబ్బందికి గురువారం ప్రత్యేక అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష ఉంటుందని పేర్కొంది.

Updated Date - 2021-02-25T08:05:03+05:30 IST