లబ్ధిదారుల లేఅవుట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-25T05:28:12+05:30 IST

సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామంలోని నిరుపేదలకు రైల్వే ట్రాక్‌ పక్కన ప్రభుత్వం 270మంది నిరుపేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది.

లబ్ధిదారుల లేఅవుట్ల పరిశీలన

సిద్దవటం, ఫిబ్రవరి24 : సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామంలోని నిరుపేదలకు రైల్వే ట్రాక్‌ పక్కన ప్రభుత్వం 270మంది నిరుపేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది. ఆ లేఅవుట్లలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు బుధవారం హౌసింగ్‌ డీఈ వీరన్న ఏఈవో సూరప్ప లే అవుట్‌ను పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి మార్కింగ్‌ ఇచ్చేందుకు కొలతకు సంక్రమంగా లేకపోవడంతో తిరిగి రీ సర్వే చేయాలన్నారు. పనులు త్వరగా తన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈ వీరన్న హౌసింగ్‌ ఏఈని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ జోత్స్న, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ చెన్నయ్య, గ్రామ వలంటీర్లు శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:28:12+05:30 IST