12లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-08-11T07:43:49+05:30 IST
లైబ్రరీ సైన్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఈనెల 12లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు.
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 10 : లైబ్రరీ సైన్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఈనెల 12లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు. బుధవారం డీఈవో మీడియాతో మాట్లాడారు. అపరాధ రుసుము లేకుండా రూ. 150 ఈనెల 12లోగా చెల్లించాలని, రూ. 60 అపరాధ రుసుముతో 22వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. నామినల్ రోల్స్ను ఈనెల 30న విజయవాడ గొల్లపూడిలోని ప్రభుత్వ పరీక్షల సంచాలకులకు పంపవలసి ఉందన్నారు. నేషనల్ మీన్స్కం మెరిట్ స్కాలర్షి్పలో ఎంపికైన విద్యార్థులు తమ వివరాలను నమోదు చేయించుకోవాలని డీఈవో తెలిపారు. దీనిపై డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు.