రైళ్లలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే టార్గెట్.. వారితో మాటలు కలిపి పరిచయం పెంచుకుని.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-07T19:10:18+05:30 IST

అతను ఒకప్పుడు రైల్వే ఉద్యోగి.. ఓ అత్యాచార కేసులో నిందితుడిగా తేలి ఉద్యోగం పోగొట్టుకున్నాడు..

రైళ్లలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే టార్గెట్.. వారితో మాటలు కలిపి పరిచయం పెంచుకుని.. చివరకు..

అతను ఒకప్పుడు రైల్వే ఉద్యోగి.. ఓ అత్యాచార కేసులో నిందితుడిగా తేలి ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.. అయినా అతనిలో మార్పు రాలేదు.. డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నాడు.. రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసి వారితో మాటలు కలుపుతాడు.. వారితో స్నేహం పెంచుకుంటాడు.. అనంతరం ఫ్రూటీలో మత్తుమందు కలిపి వారి చేత తాగిస్తాడు.. వారు నిద్రపోయాక పర్సు, మొబైల్, ఇతర వస్తువులు తీసుకుని పరారవుతాడు. 


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఓ మహిళకు ఆరు రోజుల క్రితం సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో అవినాష్ గుప్తా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమెతో మాటలు కలిపాడు. ఆమెకు ఫ్రూటీలో మత్తుమందు కలిపి ఇచ్చి బలవంతంగా తాగించాడు. ఆమె నిద్రపోయాక ఆమె డబ్బు, బంగారం, మొబైల్ తీసుకుని పారిపోయాడు. దీంతో ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు కూడా రైల్వేలో ప్రయాణించిన నలుగురు మహిళలు అలాగే ఫిర్యాదులు చేశారు. 


దీంతో పోలీసులు సీరియస్‌గా విచారణ ప్రారంభించారు. జబల్పూర్ రైల్వే స్టేషన్‌లోని అమర్చిన సీసీటీవీ కెమేరాలను పరిశీలించారు. ఆ వీడియోలో నిందితుడు అవినాష్‌ను బాధిత మహిళ గుర్తించింది. రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు తనను తాను రైల్వే గార్డుగా పరిచయం చేసుకుని అవినాష్ చోరీలకు పాల్పడుతున్నాడు. అతడిని పట్టుకున్న పోలీసులు ఇతర కేసుల గురించి కూడా విచారణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-07T19:10:18+05:30 IST