రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది: అంజన్ కుమార్ యాదవ్

ABN , First Publish Date - 2022-04-22T20:39:56+05:30 IST

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని మాజీ ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది: అంజన్ కుమార్ యాదవ్

ఖమ్మం: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని మాజీ ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారికి సముచిత స్థానం లేదని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న జన సంఘర్షన్, రైతు సంఘర్షణ సభ నిర్వహించనున్నట్టు అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. 

Updated Date - 2022-04-22T20:39:56+05:30 IST