మాజీ ఎంపీ నంది ఎల్లయ్యకు నివాళి

ABN , First Publish Date - 2020-08-09T06:36:02+05:30 IST

పీసీసీ ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని ..

మాజీ ఎంపీ నంది ఎల్లయ్యకు నివాళి

వెల్దండ, ఆగస్టు8: పీసీసీ ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకులు  అన్నారు. శనివారం నంది ఎల్లయ్య మృతి చెందడంతో స్థానిక నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, పంతునాయక్‌, నాగేశ్వర్‌గౌడ్‌ ఉన్నారు. 


కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు

కొల్లాపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్‌ సభ్యు డు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు నంది ఎల్లయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వ రుడు అన్నారు. శనివారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్‌ సభ్యునిగా పలుమార్లు ఎన్నికైన నంది ఎల్లయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలకు అనేక సేవలం దించారన్నారు. ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గాలియాదవ్‌, కొల్లాపూర్‌ ముని సిపాలిటీ అధ్యక్షుడు డీజే.ప్రమోద్‌కుమార్‌, రాముయాదవ్‌  పాల్గొన్నారు. 


చారకొండ: నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య శనివారం మృతిచెందడం పట్ల బీసీ కులాల  సమన్వయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూలూరి మహేష్‌గౌడ్‌ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది ఎల్లయ్య మృతి సామాజిక, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటని అన్నారు.  


కందనూలు: సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూ కార్య కర్తలకు అండగా నిలిచిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు, దళిత బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటని యువజన కాం గ్రెస్‌ పార్లమెంట్‌, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కొడిదెల రాము అన్నారు.

Updated Date - 2020-08-09T06:36:02+05:30 IST