నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఆరిమిల్లి
ABN , First Publish Date - 2021-11-27T05:21:40+05:30 IST
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
అత్తిలి, నవంబరు 26 : నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మండలంలో తిరుపతిపురం, వరిఘేడు, బల్లిపాడు, గుమ్మంపాడు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ పండించిన రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లిందన్నారు. అత్తిలి మండలం ఎక్కువ శాతం రైతులు స్వర్ణ పంటను సాగు చేసి నష్టపోయారన్నారు. ధాన్యం సేకరించే విధానంలో మార్పులు చేసి రైతులకు న్యాయం జరిగేలా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అత్తిలి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.