10 రేట్లు ఎక్కువగానే కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-06-18T05:24:09+05:30 IST

ప్రభుత్వం చెప్పిన దానికంటే మే నెలలో 10 రెట్లకు పైగానే కరోనా మరణాలు సంభవించాయని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

10 రేట్లు ఎక్కువగానే కరోనా మరణాలు
తెనాలి శ్రావణ్‌కుమార్‌

గుంటూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చెప్పిన దానికంటే మే నెలలో 10 రెట్లకు పైగానే కరోనా మరణాలు సంభవించాయని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. ఆక్సిజన్‌ అందక, మందులు లేక, ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేక మరణించినవారే ఎక్కువన్నారు. ఇలాంటి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లు చనిపోతున్నా పాలకులు లెక్కచేయటం లేదని మండిపడ్డారు. మాస్కే పెట్టుకోని నాయకత్వంలో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారన్నారు. కరోనా చికిత్స కోసం 10 నుంచి 12 ఆసుపత్రులకు తిరిగినవారు ఎందరో ఉన్నారని తెలిపారు.  సూది ఉంటే మందు లేదు, మందుంటే సూది లేదు.. పడకలుంటే ఆక్సిజన్‌ ఉండదు, ఆక్సిజన్‌ లభిస్తే పడకలుండని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మందులు, ఇంజక్షన్లు ఆఖరికి శ్మశానాల వద్ద కట్టెలను కూడా బ్లాక్‌లో అమ్ముతున్నా  ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

 

Updated Date - 2021-06-18T05:24:09+05:30 IST