ఎమ్మార్వో బాగోతం.. ఎమ్మెల్యేకు తెలీదా : రామకృష్ణ

ABN , First Publish Date - 2021-08-09T21:30:39+05:30 IST

నెల్లూరు: వెంకటగిరి ఎమ్మార్వో అవినీతం బాగోతం ఎమ్మెల్యే ఆనంకు తెలీకుండా ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు.

ఎమ్మార్వో బాగోతం.. ఎమ్మెల్యేకు తెలీదా : రామకృష్ణ

నెల్లూరు: వెంకటగిరి ఎమ్మార్వో అవినీతం బాగోతం ఎమ్మెల్యే ఆనంకు తెలీకుండా ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ తహసీల్దారు ఆదిశేషయ్యను ఇక్కడ ఎందుకు నియమించుకున్నారో.. అందరికీ తెలుసని చెప్పారు. వెంకటగిరి మొత్తాన్ని అమ్మదలుచుకున్నారా.. అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ, రూరల్ పరిధిలో తహసీల్దారు రూ.లక్షలు తీసుకొని భూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన వద్ద అన్ని సక్ష్యాలూ ఉన్నాయని, విజిలెన్స్ ఎంక్వయిరీలో అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-09T21:30:39+05:30 IST