దాడులు పిరికిపంద చర్య

ABN , First Publish Date - 2021-10-20T05:46:39+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేయడం పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడులు పిరికిపంద చర్య
ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

ధూళిపాళ్ల 

పొన్నూరుటౌన్‌, అక్టోబరు 19: టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేయడం పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులతో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలనుకోవడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఇది  ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లగా శాంతి భద్రతలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో జరిగిన దాడులు అరాచకానికి పరాకాష్టగా పేర్కొన్నారు. టీడీపీ నాయకుల విమర్శలకు సమాధానం చెప్పలేని వైసీపీ శ్రేణులు దాడులతో ప్రతిపక్ష నేతల గొంతును నొక్కాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. స్వయంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడులు జరుగుతుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-20T05:46:39+05:30 IST