గుడివాడలో దాడులు హేయం
ABN , First Publish Date - 2022-01-22T05:06:07+05:30 IST
గుడివాడలో టీడీపీ నాయకులపై పోలీసుల సమక్షంలోనే వైసీపీ వర్గీయులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు.
పొన్నూరు టౌన్, జనవరి 21: గుడివాడలో టీడీపీ నాయకులపై పోలీసుల సమక్షంలోనే వైసీపీ వర్గీయులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. కాసినో నిర్వహించి తప్పు చేయడమే కాకుండా నిజనిర్ధారణకు వచ్చిన వారిపై దాడి చేయడం దారుణమన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ప్రతి పక్షంగా టీడీపీ తన భాధ్యతలను నిర్వహించడం నేరమా అని ప్రశ్నించారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే గుడివాడకు ప్రతిపక్షం రావాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు జూదం, గాంబ్లింగ్ నిర్వహించే వారికి రెడ్ కార్పెట్ వేసి నిజాలు వెలికితీయాలని ప్రయత్నించిన వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యకమన్నారు. పోలీసులు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.