టీడీపీతోనే భావితరాలకు భవిష్యత

ABN , First Publish Date - 2021-10-24T05:10:18+05:30 IST

భావితరాల భవిష్యత టీడీపీతోనే సాధ్యమని సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు.

టీడీపీతోనే భావితరాలకు భవిష్యత
జాగర్లమూడి వెంకటరావమ్మను సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

నగదు, బంగారం ఇచ్చిన వెంకటరావమ్మకు సత్కారం

పొన్నూరు, అక్టోబరు 23: భావితరాల భవిష్యత టీడీపీతోనే సాధ్యమని సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు.  వైసీపీ గూండాలు ధ్వంసం చేసిన టీడీపీ కేంద్రకార్యాలయానికి మరమ్మతులు చేయాలని నిడుబ్రోలుకు చెందిన జాగర్లమూడి వెంకటరావమ్మ తన బంగారు గొలుసు, 5 వేలు నగదును నరేంద్రకుమార్‌కు అందచేశారు. ఈ క్రమంలో శనివారం ఆమె  నివాసానికి వెళ్లిన నరేంద్ర ఆమెను పూలమాలలతో  సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంతోనే  రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయని తెలిపారు. భావితరాలకు వెలుగునిచ్చే టీడీపీ కార్యాలయం ఈ విధంగా ఉండటం చూడలేక నగదు, బంగారు గొలుసు అందచేసిన్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం చుట్టూ ఉన్న పగిలిన అద్దాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా ఈ మొత్తం అందచేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు అహ్మద్‌ఖాన్‌, బొర్రురామారావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ ఆరె ప్రసాదరావు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు నన్నపనేని ప్రభాకరరావు, మాదాల వెంకటేశ్వరరావు, పి.సుబ్బారావు, గోగినేని వెంకటేశ్వరరావు, వెంకటరావమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.    


Updated Date - 2021-10-24T05:10:18+05:30 IST