ప్రజాస్వామ్య విలువలకు వైసీపీ పాతర

ABN , First Publish Date - 2021-03-02T05:42:14+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు.

ప్రజాస్వామ్య విలువలకు వైసీపీ పాతర
మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

పొన్నూరుటౌన్‌, మార్చి1: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు.  సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడుకి ఉన్న హక్కులను కాలరాయాలని ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నించటం దానికి ప్రభుత్వ అధికారులు సహకరించటం హేయమైన చర్య అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని నిర్బంధించటంలో చూపించే ఉత్సాహం పాలనలో చూపిస్తే బాగుటుందని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత చేస్తున్న పోరాటాలతో పాలకుల అసమర్ధత బయటపడుతుందనే భయంతోనే ఈ విధంగా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని నాశనం చేసి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, రాష్ర్టాభివృద్ధిని కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 


Updated Date - 2021-03-02T05:42:14+05:30 IST