విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

ABN , First Publish Date - 2022-08-07T05:12:16+05:30 IST

విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్ధేశించుకుని అందుకోసం సానుకూల ధృక్పథంలో శ్రమించాలని మాజీ ఎమ్మెల్సీ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆచార్య కె.నాగేశ్వర్‌ అన్నారు.

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
మాట్లాడుతున్న ఆచార్య నాగేశ్వర్‌

మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్‌

గుంటూరు(విద్య), ఆగస్టు 6: విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్ధేశించుకుని అందుకోసం సానుకూల ధృక్పథంలో శ్రమించాలని మాజీ ఎమ్మెల్సీ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆచార్య కె.నాగేశ్వర్‌ అన్నారు. జీవితాన్ని గెలవడం ఎలా? అనే అంశంపై భాష్యం మెడెక్స్‌ ఆధ్వర్యంలో శనివారం చంద్రమౌళినగర్‌లోని మెయిన్‌ క్యాంపస్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితం వారి చేతుల్లోనే ఉంటుందని, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.  సదస్సులో భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, భాష్యం మెడెక్స్‌ ప్రిన్సిపాల్‌ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-07T05:12:16+05:30 IST