మాజీ ఎమ్మెల్యే నాగినేని సతీమణి కమలాదేవి మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:23:15+05:30 IST

అద్దంకి నియో జకవర్గ తొలి శాసనసభ్యుడు నాగినేని వెంక య్య సతీమణి కమలాదేవి (95) శనివారం తుదిశ్వాస విడిచారు.

మాజీ ఎమ్మెల్యే నాగినేని సతీమణి కమలాదేవి  మృతి
కమలాదేవి(ఫైల్‌)


అద్దంకి, డిసెంబరు 5 : అద్దంకి నియో జకవర్గ తొలి శాసనసభ్యుడు నాగినేని  వెంక య్య సతీమణి కమలాదేవి (95) శనివారం  తుదిశ్వాస విడిచారు. మండలంలోని ధేనువ కొండకు చెందిన నాగినేని వెంకయ్య అద్దంకి నియోజకవర్గ  తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  కమలాదేవి గుంటూరు లో కుమార్తె వద్ద ఉంటూ శనివారం ఉద యం మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామం  ధేనువకొండ తీసుకొచ్చి శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కమలాదేవి మృతి పట్ల పలువురు సంతాపం  తెలిపారు.


Updated Date - 2020-12-06T05:23:15+05:30 IST