రక్షణ కల్పించండి
ABN , First Publish Date - 2021-07-27T05:34:06+05:30 IST
ప్రభుత్వం అవలంబిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై, టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు ప్రయత్నిస్తున్న వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీని ఆశ్రయించారు.
కాకినాడ
క్రైం, జూలై 26: ప్రభుత్వం అవలంబిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఎండగడుతూ
ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై, టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు
ప్రయత్నిస్తున్న వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ
అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీని ఆశ్రయించారు.
మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ
ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో
ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్బాబును సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం
మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై
పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. అయితే పెద్దాడ గ్రామ ఎంపీటీసీ
ఎన్నికల ప్రక్రియలో గత ఏడాది మార్చి 11న నామినేషన్ల సందర్భంగా పెదపూడి మండల
కార్యాలయంలో కొంత మంది వైసీపీ పార్టీ నాయకులు తనపై దాడికి ప్రయత్నించగా
తప్పించుకున్నట్లు చెప్పారు. అప్పట్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా
కేసు నమోదు చేయలేదన్నారు. బిక్కవోలు మండలం కాపవరంలో అక్రమంగా గ్రావెల్
మైనింగ్కు పాల్పడుతున్నారన్న సమాచారంతో అక్కడకు పరిశీలనకు వెళ్లిన తనపై
వైసీపీ పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ, వైసీపీ
నాయకుల నిరంకుశ విధానాలను ప్రజాస్వామ్యరీతిలో ప్రశ్నిస్తుంటే దాడులకు
పాల్పడుతున్నారని తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు.