ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పా?

ABN , First Publish Date - 2021-10-20T05:41:27+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయం, విశాఖ, రేణిగుంట కార్యాలయాలపె దాడులు చేయటమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పా?
మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

పెదకూరపాడు, అక్టోబరు 19: టీడీపీ కేంద్ర కార్యాలయం, విశాఖ, రేణిగుంట కార్యాలయాలపె దాడులు చేయటమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పా అని అన్నారు. ధ్వంసం చేయడం అంటే వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరించటమేనని, ప్రతిపక్ష పార్టీలుగా తాము చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడం ఏంటన్నారు.  కూతవేటు దూరంలో ఉన్న డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం సిగ్గుచేటన్నారు. ప్లాన ప్రకారం పక్కా వ్యూహంతో జరిగిన దాడిగా భావిస్తున్నామని, ప్రభత్వం తన విధానాలను మార్చుకోక పోతే భవిష్యతలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. 


Updated Date - 2021-10-20T05:41:27+05:30 IST