ఆదర్శ రాజకీయాలకు చిరునామా గొట్టిపాటి
ABN , First Publish Date - 2022-01-26T03:47:17+05:30 IST
ఆదర్శ రాజకీయాలకు చిరునామా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గొట్టిపాటి కొండపనాయుడని మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కంభం
కావలిటౌన్, జనవరి 25: ఆదర్శ రాజకీయాలకు చిరునామా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గొట్టిపాటి కొండపనాయుడని మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గొట్టిపాటి 20వ వర్ధంతిని పురస్కరించుకుని గొట్టిపాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రంకురోడ్డులో ఉన్న గొట్టిపాటి విగ్రహం వద్ద ట్రస్ట్ కార్యదర్శి జ్యోతి బాబురావు అధ్యక్షతన గొట్టిపాటి సంస్మరణ సభ జరిగింది. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న కంభం, తదితరులు గొట్టిపాటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కంభం మాట్లాడుతూ పాత తరం రాజకీయాల్లో గొట్టిపాటి పేరు ప్రముఖంగా చెప్పుకునేవారని, విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఆదర్శ నేతగా గొట్టిపాటి ఖ్యాతి గడించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యులు మాలెపాటి సుబ్బానాయుడు, గ్రంధి యాయాదిశెట్టి, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మధుబాబు నాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాల వెంకట్రావు, మాజీ ఎమ్పీపీ మద్దసాని వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ శ్రీను, సీపీఎం జిల్లా నేత శ్రీరాములు, సీపీఐ నేత డేగా సత్యం, పులిగుంట మధురెడ్డి, గంటా నరసింహులు, దామా మహేష్, కె రామారావు, కావలి, ఉదయగిరి నియుజకవర్గాలకు చెందిన అభిమానులు పాల్గొన్నారు.