ప్రజారోగ్యంతో జగన్‌ చెలగాటం

ABN , First Publish Date - 2022-06-27T05:19:51+05:30 IST

ప్రజారోగ్యాన్ని హరించే విషపూరిత రసాయనాలతో మద్యం విక్రయిస్తూ జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

ప్రజారోగ్యంతో జగన్‌ చెలగాటం
సమావేశంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

జీవీ ఆంజనేయులు

వినుకొండ, జూన్‌ 26: ప్రజారోగ్యాన్ని హరించే విషపూరిత రసాయనాలతో మద్యం విక్రయిస్తూ జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభిస్తున్న బ్రాండ్లు అన్నీ జగన్‌రెడ్డి, ఆయన బంధువులు, వారి పెట్టుబడిదారులు తయారు చేస్తున్న మద్యమేనని విమర్శించారు. మూడు బ్రాండ్‌లలో విషరసాయనాలు ఉన్నట్లు ల్యాబ్‌ పరీక్ష ద్వారా వెల్లడైనట్లు తెలిపారు. ఈ విషరసాయనాలతో కూడిన మద్యం తాగడం వల్ల ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని, అంతేకాకుండా మతిస్థితిమితం కోల్పోయి మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల నేరాలకు ఈ  బ్రాండ్‌లు తాగడమే కారణమన్నారు. రాష్ట్రంలోని కాపులకు జగన్‌రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఈ ఏడాది విడుదల చేస్తున్న కాపు నేస్తంలో 41వేల మంది అర్హులైన లబ్ధిదారుల పేర్లు  తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. గత ఏడాది 3,27,244మందికి అందిస్తే జూలైలో అందించే మూడో విడతలో 2.85లక్షల మందికి ఇస్తూ 41వేల మంది పేద కాపు, బలిజ, తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.  

Updated Date - 2022-06-27T05:19:51+05:30 IST