కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

ABN , First Publish Date - 2020-07-06T02:37:11+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో ఈ వైరస్ విజృంభిస్తోంది.

కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్ కరోనాకు బలయ్యారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్న కేసులో ఆయనకు పదేళ్ల జైలుశిక్ష విధించారు. ఢిల్లీలోని మండోలీ జైల్లో ఉన్న ఈయన ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. 70 ఏళ్ల యాదవ్‌కు కరోనా ఉన్నట్లు జూన్ 26న తెలియగా, 30వ తేదీన కుటుంబం ఆయన్ను ద్వారకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-07-06T02:37:11+05:30 IST