టీడీపీ నేతలపై దాడులు దారుణం
ABN , First Publish Date - 2022-01-22T05:33:34+05:30 IST
టీడీపీ నేతలపై దాడులు దారుణం
మాజీమంత్రి నెట్టెం రఘురామ్
జగ్గయ్యపేట, జనవరి 21 : కేసినోపై నిజనిర్ధారణకు వచ్చిన టీడీపీ నేతలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేయటం దారుణమని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతుల మంత్రి నిజస్వరూపం ఎక్కడ బట్టబయలు అవుతుందోననే భయంతో రౌడీమూకలను రెచ్చగొట్టి దాడి చేయటం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేసినోలను అడ్డుకోవటం చేతకాని పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.