యాదగిరిగుట్టపై.. ఆత్మహత్య చేసుకుంటా..: మోత్కుపల్లి

ABN , First Publish Date - 2021-08-29T17:59:10+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో దళితబంధు పథకం వంద శాతం అమలు కాకపోతే యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో

యాదగిరిగుట్టపై.. ఆత్మహత్య చేసుకుంటా..: మోత్కుపల్లి

హైదరాబాద్: తెలంగాణలో దళితబంధు పథకం.. వంద శాతం అమలు కాకపోతే యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని వంద శాతం అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మాటల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు. సీఎం ప్రకటించినట్లే చేస్తారనే నమ్మకం తనకు ఉందని.. ఒకవేళ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.


రేవంత్ వల్లే.. చంద్రబాబు నాశనమయ్యాడు..

టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డే అని మోత్కుపల్లి ఆరోపించారు. ఆయన వల్లే చంద్రబాబు నాశనమయ్యారని విమర్శించారు. రేవంత్ జీవితమంతా మోసాలు, బ్లాక్ మెయిలింగే అని దుయ్యబట్టారు. ఆర్టీఐని వాడుకుంది.. మొత్తం రేవంత్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. దళితబంధు పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. దళితులు కులవివక్షకు గురై మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. వారివి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులని చెప్పారు. గ్రామాల్లో దళితులు గతంలో రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు.


దళితుల సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్.. మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఓ పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకానికి మద్దతు ఇవ్వడం.. సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా పని చేసినా.. దళితుల కోసం ఎవరూ స్పందించలేదని చెప్పారు. దళితుల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అంతా అంటున్నారని తెలిపారు. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తామని మోత్కుపల్లి పేర్కొన్నారు.

Updated Date - 2021-08-29T17:59:10+05:30 IST