మాజీ మంత్రికి ‘కరోనా’ పాజిటివ్...
ABN , First Publish Date - 2021-04-08T12:53:22+05:30 IST
కళ్లకురిచ్చి జిల్లా వడకనందల్ ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మోహన్కు కరోనా పాజిటివ్ వున్నట్లు నిర్ధారించారు.
ప్యారీస్(చెన్నై): కళ్లకురిచ్చి జిల్లా వడకనందల్ ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మోహన్కు కరోనా పాజిటివ్ వున్నట్లు నిర్ధారించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో అటవీ, పర్యావరణం, పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా, అసెంబ్లీ విప్గా మోహన్ వ్యవహరించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శంకరాపురం శాసనసభ నియోజకవర్గాన్ని అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకేకు కేటాయించినందువల్ల పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు మోహన్ పీఎంకే అభ్యర్ధికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, జనం మధ్య వారం రోజులు పైగా గడిపిన మోహన్కు కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది. దీంతో ఆయన నగరంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతు న్నారు. ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో ఆయన కారు డ్రైవర్, కుటుంబసభ్యులు, ఆయనతో పాటు తిరిగిన పార్టీ నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు